Friday, April 25, 2025
Homeఆంధ్రప్రదేశ్చేయూత స్వచ్ఛంద సంస్థ అధినేత దారుణ హత్య.

చేయూత స్వచ్ఛంద సంస్థ అధినేత దారుణ హత్య.

Listen to this article

సస్పెండ్‌ చేయించాడు అనే ఆక్రోషంతో యువకుడి హత్య

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ కానిస్టేబుల్ ఈ హత్యకు సూత్రదారి.

పయనించే సూర్యుడు: ఏప్రిల్ 23: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.

నూగురు వెంకటాపురం:తన బంధువుతో అక్రమ సంబంధం కోనసాగిస్తున్నాడని ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసి కానిస్టేబుళ్‌ సస్పెండ్‌కు కారణమైన సాయి ప్రకాశ్‌ అనే యువకుడుని దారుణంగా హత్య చేసిన కానిస్టేబుల్‌తో సహ ఐదుగురిని అరెస్టు చేసిన హన్మకొండ పోలీసులు. వీరి నుండి పోలీసులు నిందితులు వినియోగించిన ఒక కారు, రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఎయిర్‌ పిస్తోల్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1.ప్రస్తుతం ములుగు వెంటాపురం పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ బాషబోయిన శ్రీనివాస్‌, చింతగట్టు,హన్మకొండ జిల్లా,2. డేవిలీ సాయి, గుంటూరు జిల్లా, ఆ.ప్ర, 3. ఆలోత్‌ అరుణ్‌కుమార్‌ ఆలియాస్‌ పండు, హన్మకొండ, 4.సబావత్‌ అఖిల్‌ నాయక్‌, హన్మకొండ, 5. రాజు, హన్మకొండ, 6.చింతం నిర్మల, వెంటాపురం (వాజేడు), ములుగు జిల్లాకు చేందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్టు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ వివరాలను వెల్లడిస్తూ ఈ నెల 15వ తారీకున రాత్రి 11 గంటల నుండి ములుగు జిల్లా, నూగురు వెంటాపురం(వాజేడు) ప్రాంతానికి చెందిన చిడెం సాయి ప్రకాశ్‌ (మృతుడు) హన్మకొండ అదృష్యమైనట్లుగా వచ్చిన ఫిర్యాదుపై హన్మకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా అదృష్యమైన యువకుడి బంధువులు ఇచ్చిన సమచారంతో పోలీసులు గతంలో మృతుడితో మనస్పర్థలు వున్న ములుగు వెంకటాపురం కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌పై అనుమానం వ్యక్తం చేసుడంతో, పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని పోలీసులు నిందితుల్లో ఒకడైన డేవిలీ సాయిని హన్మకొండ బస్టాండ్ లో అదుపులో తీసుకోని విచారించగా, మిగితా నిందితులు అందరు వరంగల్‌ కోర్టు వెనుక భాగంలో అటోలో వున్నట్లుగా ఇచ్చిన సమాచారంతో మరో నలుగురు నిందితులను అరెస్టు చేయగా, మహిళా నిందితురాలు నిర్మలను హన్మకొండ బస్టాండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా,ప్రధాన నిందితుడైన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ 2009 హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికై పరస్పర బదిలీల్లో నిందితుడు హన్మకొండ బదిలీ అయినాడు. మరికొద్ది రోజులకు 317 జి.ఓ ప్రకారం మరోమారు శ్రీనివాస్‌ ములుగు జిల్లాకు వాజేడ్‌ వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌ బదిలీ అయినాడు. నిందితుడు ఈ పోలీస్‌ స్టేషన్‌ విధులు నిర్వహించే సమయంలో ఇదే ప్రాంతంలో నివసించే మరో నిందితురాలు నిర్మలతో పరిచయం ఏర్పడిరది. ఈ పరిచయం కాస్తా ఆక్రమ సంబంధంగా మారటంతో నిందితురాలి బంధువు వరసకు కొడుకైన మృతుడు సాయి ప్రకాశ్‌తో పాటు నిందితురాని భర్త మరియు అమె బంధువులు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ వ్యవహరంపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్‌ అధికారులు కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను సస్పెండ్‌ చేసారు. కొద్ది కాలం అనంతరం ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌ తిరిగి గత ఏడాది డిసెంబర్‌ మాసంలో విధుల్లో చేరాడు. తనపై పోలీస్‌ అధికారులకు ఫిర్యాదు చేసి సస్పెండ్‌ కారణమైన మృతుడి సాయి ప్రకాశ్‌పై కక్ష్య పెంచుకొని నిందితుడు శ్రీనివాస్‌ తగిన సమయం కోసం ఎదురు చూసాడు. ఈ నెల 15వ తేదిన నిందితురాలు నిర్మల తన మామాగారికి ఆరోగ్య పరీక్షలకై కొసం తన భర్తతో పాటు, సాయి ప్రకాశ్‌తో కలిసి హన్మకొండకు కారులో వచ్చినట్లుగా నిందితుడు శ్రీనివాస్‌ ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో, వెంటనే నిందితుడు శ్రీనివాస్‌ మిగితా నిందితులతో కల్సి అదే రోజు రాత్రి మృతుడు సాయి ప్రకాశ్‌ ఒంటరీగా ప్రయానిస్తున్న కారును ఆటో వెంబడిస్తూ సుమారు రాత్రి 11.30 సమయంలో నిందితులు గోపాల్‌పూర్‌ క్రాస్‌ రొడ్‌ వద్ద వున్న బేబి సైనిక్‌ స్కూల్‌ వద్ద నిందితులు కారు అడ్డగించి నిందితులు కారులో ఎక్కి కారును నడుపుతూ మృతుడు సాయి ప్రకాశ్‌ తీవ్రం కొట్టుకుంటూ హసన్‌పర్తి శివారు ప్రాంతంలో కారు అపి మృతుడు సాయి ప్రకాశ్‌ను నిందితులు శాలువతో గొంతుని బిగించి దారుణంగా హత్య చేసారు.
హత్య అనంతరం నిందితులు మృతుడి కారులోనే హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జిల్లెడు గడ్డ తండా గ్రామ శివారులోని ఓ బావిలో మృతుడి మృతదేహాన్ని పడవేసి నిందితులు తిరిగి వేలేరు మీదుగా హన్మకొండ ఏషియన్‌ మాల్‌ ప్రాంతంలో కార్‌ను పార్క్‌ చేసినట్లుగా నిందితులు పోలీసుల విచారణలో వెల్లడిరచారు.
మరుసటి రోజున మృతుడి మృతదేహాన్ని గుర్తించి జిల్లెడు గడ్డ తండా గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అనుమాన్పడంగా మరణించిన వ్యక్తిగా హుస్నాబాద్‌ పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన హన్మకొండ ఏసిపి దేవేందర్‌ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్‌ సతీస్‌తో పాటు ఇతర పోలీస్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు. ఈ ప్రెస్ మీట్ లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఏ. ఎస్పీ మనన్ భట్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments