Sunday, April 20, 2025
Homeఆంధ్రప్రదేశ్జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా రహదారి భద్రత పై అవగాహన

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా రహదారి భద్రత పై అవగాహన

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 23 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ఆర్టిఏ కూకట్పల్లి యూనిట్ కార్యాలయం అధికారులు.. ట్రాఫిక్ పోలీసులు పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. కెపిహెచ్బి నాలుగో రోడ్ లోని గ్లోబల్ ఎడ్జ్ పాఠశాలలో గురువారం జాతీయ రహదారి భద్రత మాచోత్సవాల పేరిట విద్యార్థులకు ఎంవీఐ శ్రీనుబాబు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. మరో కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి ఆర్టిఏ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాటలడుదుతూ ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించటానికి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు , ట్రాఫిక్ ఎస్ఐ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments