Tuesday, May 20, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణలో రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు

తెలంగాణలో రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ మే 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. క్వార్టర్​ బాటిల్​ మద్యానికి రూ.పది హాఫ్​, ఫుల్​ బాటిళ్లపై రూ.ఇరవై నుంచి నలబై రూపాయల చొప్పున పెంచుతూ తెలంగాణ బెవరేజెస్​ కార్పొరేషన్ లిమిటెడ్​ నిర్ణయం తీసుకుంది.పెంచిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. డిపోలతో పాటు మద్యం దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసింది. బ్రూవరీల యాజమాన్యాల డిమాండ్ల మేరకు సర్కార్​ నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను పెంచింది. ఇదే క్రమంలో ఇప్పుడు మద్యం ధరలను పెంచింది. జస్టిస్‌ జైశ్వాల్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా బీర్ల ధరలపై పది హేను శాతం పెంచుతూ ఫిబ్రవరి 11న సర్కార్‌ నిర్ణయం తీసుకుం ది. 2019 నుంచి రాష్ట్రంలో బీర్ల ధరలు పెరగలేదు. ముడి పదార్ధాల రేట్లు పెరిగినా, అప్పటి ధరతోనే బ్రూవరీస్‌ కంపెనీలు సరఫరా చేస్తూ వచ్చాయి. వివిధ సంప్రదారులు, బేవరేజెస్ కంపెనీల విజ్ఞప్తుల మేరకు ఒక్కో బీరు బాటిల్‌పై కనీసం రూ.18 నుంచి గరిష్ఠంగా రూ.యబై వరకు పెంచుతూ ప్రభుత్వం నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా గత ఫిబ్రవరిలో బీర్ల ధరలను పెంచింది ఇదే క్రమంలో ఇప్పుడు మద్యం ధరలను పెంచింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments