Sunday, June 8, 2025
Homeఆంధ్రప్రదేశ్పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 6//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, నారాయణపేట మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ ఆద్వర్యంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణ పట్ల తమ సంకల్పాన్ని వ్యక్తపరిచారు ఈ సందర్భంగా డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన ప్రతిస్పందన, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే రేపటి తరం కోసం పచ్చదనం కాపాడగలము జనసేన పార్టీ మానవ సేవలో భాగంగా ప్రకృతిని సంరక్షించడానికీ ముందుండుతుంది అన్నారు ఈ మొక్కల నాటుడు కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన పెంచడమే కాకుండా, వాతావరణ మార్పులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ సందర్బంగా గుర్తుచేశారు. జనసేన కార్యకర్తలు, యువత మరియు గ్రామస్థుల చొరవతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని, ఈ తరహా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా నిర్వహించబడతాయని నాయకులు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments