
-పూజల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, డీ.సీ..ఎస్ చైర్మన్ కొత్వాల
పయనించే సూర్యుడు. పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి. ఫిబ్రవరి 12. పాల్వంచ టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధి లో నీ పాత పాల్వంచ లోని శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమ య్యాయి.ఈ నెల 10 వ తేదీ నుండి 13 వ తేదీ వరకు జరగనున్నాయి రెండవరోజు మంగళవారం దేవాలయం ప్రధాన పూజారి కందాల సింహాద్రి ఆనందకుమారాచార్యులుఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశము, మండపారాధన, గరుడ వాహనము, ధ్వజారోహణము, గరుడ ముద్దా, అగ్ని ప్రతిష్ట, భోగానివేదన, మహిళలు పసుపు కొట్టుట వంటి పూజలు చేశారు. ఈ పూజ కార్యక్రమాల్లో రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని, పూజలు చేశారు. ఈ కార్యక్రమం లో పాత పాల్వంచ మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, నిర్వాహకులు కిలారి సుజాత, కోండం వెంకన్న, గంగుల చంద్రశేఖర్, ముళ్ళ పూడి శ్రీకాంత్, విజయలక్ష్మి, సీతక్క, రాఘవమ్మ, లక్ష్మి, భవాని, జ్యోతి, సత్యవతి, మంగవేణి, జాహ్నవి, కృష్ణవేణి, కమల, రత్నమ్మ, సునీల్, జయ, వనమా రత్నం, మౌనిక, రామ, చంద్రకళ, రమాదేవి, కీర్తి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.