Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరచండి

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరచండి

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాస్ తేదీ 21 మే

ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ డిమాండ్ ఆత్మకూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఏఐవైఎఫ్ నాయకులు తో కలిసి ఆత్మకూరులో ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పాఠశాలలో తలుపులు, కిటికీలు టాయిలెట్ లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు
విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఈ ప్రభుత్వం విద్య పట్ల ఎంత శ్రద్ధగా ఉందో అర్థమవుతుందని అన్నారు. మండలంలోని పలు గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికి వసతులకు కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. జూన్ లో పాఠశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందజేయాలని, కిటికీలు తలుపులకు మరమ్మతులు చేయాలని, టాయిలెట్లు లేని పాఠశాలను గుర్తించి వెంటనే టాయిలెట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవి మహమూద్ వసీమ్ చరణ్ సమీర్ ఇమ్రాన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments