
:పయనించే సూర్యుడు: జూన్ 21: మక్తల్
మక్తల్ పట్టణంలోని యాదవ్ నగర్ లో గల శ్రీ వీరభద్ర స్వామి దేవాలయంలో స్వామి వారి మూలవిరాట్ కు పట్టణానికి చెందిన శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస్ గుప్తా దంపతులు తమ సొంత ఖర్చులతో మకర తోరణం చేయించి ఇచ్చారు. సందర్భంగా నేడు ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన దాతకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సందర్భంగా కాలనీ పెద్దలు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువాలతో సన్మానించారు.ఇట్టి పూజా కార్యక్రమంలో శివకుమార్ మేస్త్రి కల్లూరి నాగప్ప నరసింహులు నాయుడు ఈసరి నాగప్ప జయరాం కురువ ఎల్లప్ప కురువ శివకుమార్ రామాంజి మరియు మల్లేష్ పాల్గొన్నారు.
