
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 09. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టి డబ్ల్యూ జె ఎఫ్) తరపున, ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో మండలంలో దరఖాస్తు చేసుకున్న, అర్హత కలిగిన రిపోర్టర్లకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ, ఏన్కూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో ఎస్ రమేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ జుజ్జురి కృష్ణమాచారి, కంభంపాటి శ్రీనివాసరావు, ఎం ఎస్ గోపాలరావు, బి గోపికృష్ణ, గుగులోత్ బావుసింగ్ నాయక్ ఇస్లావత్ నరసింహ, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు