
సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం…
రుద్రూర్, ఆగస్టు 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు బుధవారం శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ కృష్ణలు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ ఎస్సై సాయన్న, తహసీల్దార్ తారాబాయి, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, మండల నాయకులు, గణేష్ మండపాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
