
( పయనించే సూర్యుడు మే 27 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
రంగా రెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో ఈరోజు శని జయంతి సందర్భంగా ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ శనికి తైలాభిషేకం గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శనీశ్వర దేవుడిని ఆరాధించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషికి కీర్తి, ఐశ్వర్యం లభిస్తాయి అని తెలిపారు.అనoతరం ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ రాజు ముఖియా ,అర్చకులు ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ను సన్మానించారు, ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కృష్ణా రెడ్డి,జాంగ నర్సింహులు, కుమారస్వామి గౌడ్,బుచ్చయ్య,కొప్పునూరి ప్రవీణ్,తుపాకుల శేఖర్, రాయికల్ శ్రీనివాస్,కృష్ణ, సీతారాం, లింగా రెడ్డి గూడ అశోక్, సతీష్,కిట్టు, గంగమోని సత్తయ్య,మాణిక్యం,అనిల్ గౌడ్, ప్రభు,శ్రీశైలం,వెంకట్ చారి, శ్రీకాంత్ గౌడ్,మనీష్ శర్మ,తదితరులు పాల్గొన్నారు..
