Tuesday, April 29, 2025
Homeఆంధ్రప్రదేశ్సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు నందు నాయక్

సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు నందు నాయక్

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

సత్తుపల్లి సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సత్తుపల్లి మండలం ఎన్టీఆర్ కాలనీ కి చెందిన బానోతు నందు నాయక్ ఎన్నికయ్యారు. సత్తుపల్లిలో జరిగిన ఆ సమాచార హక్కు చట్టం 2005 యాక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ బావుసింగ్ బానోత్ నందు నాయక్ ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవం గా నియమించడం జరిగింది . ఈ సందర్భంగా బానోతు నందు నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భావుసింగ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ సభ్యులు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తానని. పారదర్శకంగా జవాబుదారితనంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు వేస్తానని అన్నారు. సమాచార హక్కు చట్టం 2005 చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తానని వారి యొక్క హక్కుల గురించి చట్టాల గురించి అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తానని. బానోతు నందు నాయక్ అన్నారు. ప్రతి ఒక్కరిని చైతన్యవంతుడిగా చేస్తాను అని తెలపడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు . రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రామారావు లతికే లక్ష్మణరావు. రాష్ట్ర పొలిటికల్ కన్వీనర్
లకావత్ ప్రసాద్. రాష్ట్ర లీగల్ అడ్వకేట్ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments