Thursday, October 23, 2025
Homeఆంధ్రప్రదేశ్సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై కోర్టులో దాడిని ఖండిస్తున్నాం"

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై కోర్టులో దాడిని ఖండిస్తున్నాం”

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 7,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

పిడిఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.యమ్.డి.రఫీ

భారతదేశపు న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పై లాయర్ చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడం చాలా దారుణం. పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎమ్.డి.రఫీ ఒక ప్రకటనలో ఈ సందర్భంగా రఫీ స్పందిస్తూ అట్టడుగు వర్గాల ప్రజలు, వ్యక్తి ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న కుల వివక్షత వెంటాడుతూ ఉంటుంది. అనటానికి ఈరోజు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గవాయిపై ఒక లాయర్ ప్రత్యక్షంగా తన చెప్పుతో దాడి చేయాలని ప్రయత్నించటం అనాగరికత, చదువుకున్న నిరక్షరాస్యుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటం దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి రాజ్యాంగం మీద, భారత పార్లమెంట్ మీద, భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీద, ప్రజాస్వామ్యం మీద దాడిగా పరిగణించి, ఆ లాయర్ పై దేశద్రోహం కేసు పెట్టి బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఇలా జరిగితే, సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని అన్నారు. ప్రజాస్వామ్యం వాదులు అందరూ తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments