
పయనించే సూర్యుడు జూలై 25 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో శుక్రవారం ఉదయం అనుమానాస్పద మృతదేహం కనపడింది. తహసిల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న చెట్టుకు వట్రుపాలెం చెందిన శివకేశవులు (52) ఉరివేసుకొని మృతి చెందినట్లు గుర్తించారు. బ మృతదేహం చూసిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఎస్సై బ్రహ్మనాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి పరిస్థితిని బట్టి రెండు రోజుల క్రితం చనిపోయినట్లు భావిస్తున్నారు. పోలీసుల కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.