Sunday, June 8, 2025
Homeఆంధ్రప్రదేశ్హైదరాబాద్ లో నేటి నుండి చేపమందు పంపిణీ కార్యక్రమం

హైదరాబాద్ లో నేటి నుండి చేపమందు పంపిణీ కార్యక్రమం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 8 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి

మృగశిర కార్తెను పురస్కరించుకుని ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల ఎనిమిదో వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై, తొమ్మిది న ఉదయం తొమ్మిది గంటల వరకు కొనసాగనుంది.రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సారి నలబై రెండు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.పంపిణీ కోసం ఫిషరీస్‌ శాఖ లక్ష చేప పిల్లలను సిద్ధంగా ఉంచింది. చేప ప్రసాద కార్యక్రమాన్ని స్పీకర్‌ ప్రసాద్‌రావు ప్రారంభిస్తారని, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొంటున్నట్లుగా ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయికుమార్‌ వివరించారు. బత్తిని కుటుంబసభ్యులైన బత్తిని గౌరీశంకర్‌ గౌడ్‌తో కలిసి ఏర్పాట్లను సాయికుమార్​ శుక్రవారం సాయంత్రం ఆయన పర్యవేక్షించారు. సాయికుమార్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పొన్నం పర్యవేక్షణలో అన్ని వసతులను కల్పిస్తున్నట్లుగా వెల్లడించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments