
అక్షరభ్యాసం చేస్తున్న దృశ్యం..
రుద్రూర్, జూన్ 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ – 4 లో సోమవారం కొత్తగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా సరస్వతి మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి, అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సునంద, ఆయా సవిత, చిన్నారుల తల్లులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.