
పయనించే సూర్యడు // మార్చ్ // 21// కుమార్ యాదవ్ // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్…
వీణవంక మండలం లోని అంకుస్ పల్లి, రెడ్డిపల్లి -2 అంగన్వాడి సెంటర్లలో శుక్రవారం ఫ్రీ స్కూల్ మేళ ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా టీచర్లు సరిత, వినోద లు మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు , బాలింతలకు, అంగన్వాడి ప్రీ స్కూల్ పిల్లల (3 నుండి 6 సంవత్సరాలు )అభివృద్ధికై అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అన్నారు.పుట్టిన బిడ్డ నుండి ఆరు సంవత్సరాల పిల్లల వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచిత పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని, తెలిపారు. అలాగే గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు పోషకాహార లోపం లేకుండా గుడ్లు, పాలు, బాలామృతం, పోషక విలువలు కలిగిన భోజనం,కురుకురేలు అందిస్తూ, ఆరోగ్యవంతులుగా మారుస్తున్నామని,వివరించారు. ప్రీస్కూల్ పిల్లలకు స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం జరిగిందని, ప్రత్యేకించి ప్రీస్కూల్ పిల్లలకు అసెస్మెంట్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని,అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలందరూ చురుకుగా తయారయ్యారని, పిల్లల్లో పోషకాహార నివారణకు అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, అనారోగ్య సమస్యలకు కూడా ఆర్ బి ఎస్ కే వారి సహకారంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, మాట్లాడారు. అంగన్వాడి కేంద్రాలు గర్భిణీలకు, బాలింతలకు, ప్రీస్కూల్ పిల్లలకు వరంగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయా సెంటర్ల ప్రీస్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
