
అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రజాకవి జయరాజ్.
పయనించే సూర్యుడు// న్యూస్ మే 26//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
పసుపుల గ్రామంలో జరిగిన విగ్రహావిష్కరణలో ముఖ్యఅతిథిగా ప్రజాకవి జయరాజు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశంలో కుల విభజన చాలా తీవ్ర స్థాయిలో ఉందని అది ఆధిపత్య వర్గాలకు మేలు చేస్తూ దేశంలో అణిచివేత వర్గాలను మరింత అంధకారంలోకి నెట్టువేస్తుందని అన్నారు. ఈ దేశం అభివృద్ధిని సాధించడం అంటే కులం లేని సమాజాన్ని కోరుకోవడమే అని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ఆయన పోరాటం ఈ దేశంలో ఉన్న యువత ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కులన్మాద దాడులు రోజు పెరిగిపోతున్నాయి. కుల నిర్మూలనపై యువత కులాంతర వివాహాలు చేసుకుని ఆదర్శంగా జీవించాలని అన్నారు. నన్ను నిలబెట్టింది నేను జీవించింది అంబేద్కర్ జీవితం మాత్రమే అన్నారు. ఈ దేశాన్ని మార్చే శక్తి అంబేద్కర్ భావజాలంలో మాత్రమే ఉన్నది దేశంలోని సబ్బండ కులాలకు అక్షర జ్ఞానంతో పాటు సామాజిక చైతన్యాన్ని ఇవ్వడంలో అంబేద్కర్ అనుసరించిన విధానం మాత్రమే ఏకైక మార్గమని అన్నారు. డిజి సూర్యచంద్ర డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దేశంలో దళితులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అన్నారు. విద్యను బోధించే పాఠశాలలో కూడా తీవ్రమైన కుల వ్యవక్షత దళిత విద్యార్థులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి సమాజాన్ని తీవ్ర ప్రభావితం చేస్తుందని అలాంటి వృత్తిలో కొంతమంది ఉపాధ్యాయులు ఇలా ఉన్మాదంతో నిండిపోయి విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపుతున్నారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని అన్నారు. సమాజంలోని అట్టడుగు వర్గాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా విద్యలో ముందు వరుసలో ఉంటూ అంబేద్కర్ లాగా అత్యున్నతమైన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి* సభా అధ్యక్షత వహించిన వారు ఈ లింగన్న కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు. పాల్గొన్నవారు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎస్ నరసింహులు, ప్రధాన కార్యదర్శి కే నర్సింలు, మక్తల్ అంబేద్కర్ సంఘ అధ్యక్షులు పృథ్వీరాజ్, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, కేన్ పీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి కృష్ణ, ఎమ్మార్పీఎస్ నాయకులు నాగేష్ జోగిని వ్యతిరేక పోరాట సమితి నాయకురాలు హజమ్మ, డిటిఎఫ్ నాయకులు పరంధాములు, జ్యోతిరావు పూలే బీసీ సంఘం నాయకులు శ్రావణ్ కుమార్, విగ్రహ దాత రామచంద్ర నరసప్ప, పుడమి ఫౌండేషన్ చైర్మన్ వేంకటపతి రాజు,బుడగ జంగాల సంఘం కళ్యాణం రాజు, గ్రామ పెద్దలు దత్తప్ప మాజీ సర్పంచ్, వాసుదేవరావు, మరియు గ్రామ పెద్దలు అంబేద్కర్ యువజన సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు