Friday, June 27, 2025
Homeఆంధ్రప్రదేశ్అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ నిలుపు దల చేయటం సరికాదు కోర్టు నిబంధనలు ప్రకారం అన్ని...

అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ నిలుపు దల చేయటం సరికాదు కోర్టు నిబంధనలు ప్రకారం అన్ని ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చి వేయాలి

Listen to this article

ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఆధ్వర్యంలో పాడేరు గ్రీవెన్స్ లో ఫిర్యాదు


పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ 27


శుక్రవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏలో జరిగిన ప్రజా గ్రీవెన్స్ నందు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని జిల్లా రెవిన్యూ అధికారి (DRO ) గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం ఐటిడిఏ పాడేరు కార్యాలయంలో, సబ్ కలెక్టర్ పాడేరు వారి కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ పాడేరు వారి కార్యాలయంలో విడివిడిగా ఫిర్యాదు చేయడం జరిగింది అని ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను,ఉపాధ్యక్షులు వంతల నాగేశ్వరరావు తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రోడ్డు వైండింగ్ పేరుతో మొదట హడావుడి చేసిన అధికారులు రాజకీయ పార్టీల ఒత్తిళ్ల కారణంగా అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రక్రియను నిలుపుదల చేయటం జరిగింది అని అన్నారు, అయితే కోర్టు నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది రాజకీయ నాయకులు చెప్పినంత మాత్రాన అక్రమ కట్టడాలు కూల్చివేతను నిలుపుదల చేయటం సరికాదని ఆయన అన్నారు. కొన్ని మండలాలలో అధికారులు అక్రమ కట్టడ దారులకు నోటీసులు ఇచ్చి వాళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తూ , అక్రమ కట్టడాలను కూల్చకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. చింతూరు డివిజన్ రంపచోరన్ డివిజన్ పాడేరు డివిజన్లో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటన్నిటిని కూల్చకపోతే అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని ఆయన హెచ్చరించారు. రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వీళ్ళు ఎవరు కోర్టు ఆదేశాలకు అతీతులు కారని, ఎవరైనా కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని రాజకీయ పార్టీలు, ప్రతినిధులు చెప్పిన మాటలు విని అధికారులు ఆక్రమణలు తొలగింపు ప్రక్రియ కొనసాగింపకపోతే రేపు జరగబోయే పరిణామాలకు, న్యాయస్థానాలు తీసుకునే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కాక తప్పదని తెలియజేశారు. ముఖ్యంగా పాడేరు లో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు గిరిజన యేతరులతోటి కుమ్మక్కై వారి వద్ద నుంచి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ మీకేమి కాదంటూ భరోసాలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని అన్నారు, అదేవిధంగా రంపచోడవరం డివిజన్లోని ఎమ్మెల్యే గారి సొంత మండలం అయిన అడ్డతీగల మండల కేంద్రంలో కొంతమంది దళారులు గిరిజన యేతరులకు, రెవెన్యూ అధికారులకు, మరోపక్క పార్టీ నాయకులకు మధ్య బ్రోకర్లుగా పని చేస్తూ గిరిజనయేతరుల నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలియజేశారు. అలాగే చింతూరు డివిజన్లో చింతూరు కేంద్రాల్లో ఎర్రంపేట ప్రాంతంలో చట్టి ప్రాంతాల్లో నోటీసులు ఇచ్చిన రెవెన్యూ అధికారులు పంచాయతీ అధికారులు నాన్ ట్రైబల్ వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి అక్రమ కట్టడాలు కూల్చకుండా వదిలేసారని ఈ సందర్భంగా విమర్శించారు. స్వయంగా చింతూరు ఐటీడీ పీఓ గారే నాన్ ట్రైబల్ ఆక్రమణదారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇది పోలవరం ముంపు ప్రాంతం ఇక్కడ ఎవరు తొలగించరు మీరే డ్రైనేజీ కి దాటి వెళ్లిపోండి ,ఇక్కడ ప్రోక్లైన్లు బుల్డోజర్లు ఏమి రావు అని భరోసా ఇవ్వటం జరిగిందని ఆరోపించారు. అయితే ప్రస్తుతం జరిగిన కొన్ని అక్రమ కట్టడాలు తొలగింపు రోడ్డు వైండింగ్ పేరుతో మాత్రమే జరిగిందని, కానీ కోర్టు ఉత్తర్వులు ప్రకారం కేవలం ఆర్ అండ్ బి స్థలాల ఆక్రమాలు మాత్రమే కాదు, చెరువులు కాలువలు, ప్రజా అవసరాలకు సంబంధించిన కమ్యూనిటీ స్థలాలు, స్మశాన వాటికలు ఇతర జనావాసాల్లో గల కాళీ ప్రదేశాలు లోని అక్రమ కట్టడాలు తొలగించాలని గౌరవ హైకోర్టు ఉత్తర్వులు పేర్కొంది. కానీ అసలైన ఉత్తర్వులు పక్కనపెట్టి కొన్ని చోట్ల రోడ్డు వైండింగ్ పేరుతో తూతూ మంత్రంగా అక్కడక్కడ కూల్చివేతలు చేసి, కొన్నిచోట్ల మార్కింగ్ చేసి వాటిని కూడా కూల్చకుండా రెవెన్యూ పంచాయతీ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. దీనిపై దశలవారీ ఉద్యమం ఆదివాసి సంక్షేమ పరిషత్తు చేయబోతుందని ఈ ఉద్యమానికి ఆదివాసీలందరూ ఐక్యంగా తరలిరావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా అక్రమ కట్టడాలు తొలగింపుకు సంబంధించి కరపత్రాలను పాడేరులో విడుదల చేశారు, ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంతల నాగేశ్వరరావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ అల్లూరి జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు, అల్లూరి జిల్లా ఉపాధ్యక్షులు చండా లోహిదాసులు, పీట ప్రసాదు, పరద సోమరాజు, సారాపు బుల్లి ధర , పరద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments