
పయనించే సూర్యుడు జూన్ 3 శర్వాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో బీసు శ్యాంప్రసాద్ (రిటైర్డ్ పోస్టుమాస్టర్), భార్య సుగుణమ్మ, కుమారుడు బిసు జాషువా, కోడలు జయప్రద, మనవళ్లు శ్యామ్ రిచ్, శ్యామ్ రిక్కీ వీరి కుటుంబము అగాపే ఆశ్రమాన్ని ప్రేమించి ఎంతోమంది ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు. మేము కూడా మా వంతుగా ఏదైనా ఆశతో ఆశ్రమంలోని నిరాశ్రయులకు భోజనాలు సిద్ధపరిచి కుటుంబముతో కలిసి అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితుడు మహేంద్ర కుటుంబం కూడా పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.