
సమస్య ఏదైనా సరైన వైద్యం అందించడమే డాక్టర్ సురంజన్ లక్ష్యం..
తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు.
.
వైద్య వృత్తిలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న దంపతులు..
పయనించే సూర్యడు, మే 30, కుమార్ యాదవ్, హుజురాబాద్ అర్ సి)
జమ్మికుంట పట్టణంలోని నూతన హాస్పిటల్ శ్రీ లక్ష్మీ నరసింహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో ప్రారంభం కానుంది.. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ కె లావణ్య, డాక్టర్ కె సూరంజాన్, లా సేవలు గర్వించదగ్గ విషయమని జమ్మికుంట పట్టణ ప్రజలు తెలిపారు. ప్రజలకి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అతి తక్కువ ధరకే అందిస్తూ జమ్మికుంట మండలమే కాకుండా చుట్టుపక్క మండలాలు నుండి నిత్యం ఎంతో మంది రోగులు ఈ హాస్పిటల్ కి వచ్చి వైద్యం చేయించుకోవడం జరుగుతుందని అలాంటి హాస్పిటల్ లో కష్టతరమైన వైద్యాన్ని కూడా ఈ డాక్టర్ దంపతులు రోగిని చిరునవ్వుతో వైద్య సేవలు అందిస్తూ వారి జబ్బును నయం చేసే గుణం వారి చేతికి ఉందని స్థానిక ప్రజలు నమ్ముతారు. జమ్మికుంట పట్టణంలో ఉండి అర్ధరాత్రి అయినా సరే తలుపు తడితే స్పందించి వైద్యం అందించే ఇలాంటి దంపతులు ఇక్కడ ఉండడం పట్టణ ప్రజలు చేసుకున్న అదృష్టమని ప్రజలు అంటున్నారు. అతి త్వరలో నిజమైన పేదవారికి ఇంకా ఎన్నో వైద్య సేవలు అందించడానికి శ్రీ లక్ష్మీనరసింహ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ త్వరలో ప్రారంభం కానుంది. హాస్పిటల్ కి వచ్చే ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
