
అధిక ఫీజులను తగ్గించాలని, పాఠ్యపుస్తకాల దందా బందు చేయాలి
విద్యా శాఖకు తక్షణమే మంత్రిని కేటాయించాలి
తక్షణమే అధికారులు స్పందించాలి లేనియెడల మీ కార్యాలయలా ముందు ఆందోళనలు తప్పవు
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం పవన్ చౌహన్
( పయనించే సూర్యుడు జూన్ 30 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల ముందు ధర్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యాసంస్థలైన నారాయణ మరియు చైతన్య విద్యాసంస్థల్లో కనీస వసతులు లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ విద్యాసంస్థల్ని తక్షణమే రద్దు చేయాలి అదే కాకుండా స్కూల్ లోపల బుక్స్ మరియు యూనిఫార్మ్స్ అమ్ముతూ అమాయకులైన తల్లిదండ్రుల దగ్గర నుండి వేల రూపాయలు తీసుకుంటూ చదువును వ్యాపారంగా మార్చిన ఇలాంటి కార్పొరేట్ విద్యాసంస్థలను తక్షణమే అధికారులు స్పందించి వారి యొక్క గుర్తింపును రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నారాయణ స్కూల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉన్నప్పటికీ పుట్టగొడుగుల మొలుస్తున్న ఈ కార్పొరేట్ విద్యా విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి అనుమతి లేని కార్పొరేట్ విద్యా సమస్యలను తక్షణమే రద్దు చేసే విధంగా అధికారులకు సూచించాలని లేని యెడల ప్రభుత్వ కార్యాలయాల ముందు విద్యార్థి లోకాన్ని ఏకం చేసి ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో షాద్నగర్ సమితి సహాయ కార్యదర్శి సాయి చౌహాన్ విజయ్ కుమార్ ఆర్థిక్ నాయుడు గణేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు.
