
ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 30 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సోమవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియోజకవర్గం లో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం బోధన్ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశం హాల్ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు కనీస అవసరాలు, సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు తలేత్తవద్దని అన్నారు. విద్య, వైద్యం తో పాటు పారిశుద్యం పై ప్రత్యేక ద్రుష్టి సారించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు స్వచ్చందంగ సేవలు అందిస్తున్నారన్నారు. ఇటీవల రేషన్ కార్డుల జారీలో మీ సేవా కేంద్రాలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, అధికారులు సమగ్ర విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలం సందర్బంగా విద్యుత్ సమస్యలు తలెట్టకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.