
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 26మడివి నెహ్రూ
ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో, టీఏసిని ఏర్పాటు చేసి, ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టాన్ని చేసి, ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలు స్థానిక ఆదివాసి లేకే కేటాయించాలని, మెగా డీఎస్సీ లో ఏజెన్సీ పోస్ట్లను మినహాయించి, ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత 13 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐటీడీఏల వద్ద రిలే నిరాహార దీక్షలతో అవిశ్రాంత ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ ఉద్యమాలకు ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సెంట్రల్ ఆర్గనైజర్ కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మడివి నెహ్రూ, ప్రధాన కార్యదర్శి, కారం దారయ్య, జిల్లా సహాయ కార్యదర్శి సోంది ప్రసాద్ చింతూరు ఐటిడిఏ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పూల మాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా చింతూరు ఐ టి డి ఎ పి ఒ అపూర్వ భరత్ ఐ ఎ ఎస్ సందర్శించారు. ఈ సందర్బంగా మడివి నెహ్రూ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన హక్కులను రాజ్యాంగబద్ధంగా సాధించుకునేందుకు ఆదివాసి నవతరం పిడికిలి బిగించిందని, తొలితరం తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఆదివాసీలకు దక్కిన ఆదివాసి ప్రాంత ఉద్యోగాలు గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు కారణంగా యావత్ ఆదివాసి సమాజం ఆందోళనకు గురైందని. ఆదివాసీలకు ఉద్యోగ హక్కులు అందడం ఎంత ముఖ్యమో తెలుగుదేశం ప్రభుత్వ విధాన నిర్ణయం పునరుద్ధరించడం ఈతరం తెలుగుదేశం ప్రభుత్వానికి అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. ఎలక్షన్లలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆలస్యంగానైనా సరే టీఏసిని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టిఎసి సభ్యులు ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ, వెంటనే సమావేశమై ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని రూపొందించి. మెగా డీఎస్సీలో ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలను మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ ద్వారా స్థానిక ఆదివాసీలతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ నేత్రుత్వంలో ఎటపాక మండల ఛైర్మెన్ ఆధ్వర్యంలో ఈ దీక్షలు జరిగాయి. వి ఆర్ పురం జడ్ పి టి సి వాల్ల రంగా రెడ్డి, మట్టపల్లి సర్పంచి పిట్టా రామారావు, చింతరేగుపల్లి పెస కమిటీ ఉపాధ్యక్షులు కోటం జయరాజు, ఎ ఎస్ పి సీనియర్ నాయకులు సున్నం కన్నారావు దంపతులు సందర్శించారు. ఈ దీక్షల్లో మడివి సాయి, సోడి అర్జున్, వీసాల శ్రీలక్ష్మి, మడివి నవ్య, కారం చందన సాయి ప్రియ, కుంజా లక్ష్మీ అశ్లేష, మడివి గురుత్వ సమంద సింగ్, తాటి మోక్ష త్రయంబిక, మడివి సూక్ష్మ సరంద సింగ్, కారం జోష్నా సాయి ప్రేమికలు పాల్గొన్నారు
