Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆక్రమణలు తొలగింపులో అధికారుల అలసత్వo ఎందుకు?

ఆక్రమణలు తొలగింపులో అధికారుల అలసత్వo ఎందుకు?

Listen to this article

దిక్షల టెంట్ తాడ్లను ముక్కలుగా కత్తిరించిన గుర్తు తెలియని దుండగులు


పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి జూన్ 15

రంపచోడవరం నియోజకవర్గం చింతూరు ఐ.టి.డి.ఏ ఎదుట గత 32రోజులు గా ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు విజయవంతంగా కొనసాగుతున్న తరుణం లో ఎవరో గుర్తు తెలియని దుండగులు ఈ వారం రోజుల్లోనే నాలుగు సార్లు టెంట్ తాడ్లను కత్తితో కోసివేయ్యడం జరిగిందని.గమనిస్తూనే ఉన్నాము దొరికితే ఎంతటివాళ్ళనైనా వొదిలిపెట్టబొమని ఆదివాసి జేఏసి రాష్ట్ర కార్యదర్శి కుంజా.అనిల్ హెచ్చరించారు. అనిల్ మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు జీవో నెంబర్ 3 కి బదులు ప్రత్యామ్నయ చట్టం తీసుకువస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉద్యోగయామకచట్టం కావాలని 32 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని , ఇది ఇలా ఉండగా, మేము రిలే నిరాహార దీక్షకు వేసుకున్న టెంట్లను గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేసి తాడ్లను ముక్కలుగా కత్తిరించడం వెనుక ఎవరి ప్రమేయం ఉందొ అర్ధం కావడం లేదని, ఎన్ని అవంతరాలు ఎదురైనా మా ఉద్యమం ఆపాభోమని అన్నారు అధికారులు అక్రమ కట్టడాలు కూల్చడంలో వెసులుబాటు ఇవ్వడం వెనుక అస్సలు కారణాలు ప్రజలకు తెలపాలని, లేకుంటే త్వరలోనే మా ఆదివాసీ సంఘాలు తీసుకునే చర్యలకు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.ఆక్రమణదారులారా మీకు నచ్చినట్లు ప్రభుత్వ భూములు, ఆదివాసుల భూములు, 1/70 చట్టానికి వ్యతిరేకంగా కబ్జా చేసి మీకు నచ్చినట్లు ఉంటాను అంటే చట్టలేమైనా మీ చుట్టాల అని గిరిజనేతర సమాజాన్ని ప్రశ్నించారు.అధికారులకు ఇదే మా హెచ్చరిక నోటీసులు ఇచ్చి అక్రమనలను రోడ్డుకి రెండు వైపులా 15 మీటర్లు తొలగించాల్సి ఉంటే ఒక రోజు 10 మీటర్లని మారో రోజు 8మీటర్లని తగ్గించుకుపోవడానికి గల కారణం ఏమిటీ? బేరాలు బాగానే కుదిరినాయా లేక గిరిజనేతర సమాజంపై ప్రేమ అన్న అనుమానాలు వస్తున్నాయి.నాలుగు మండలాల్లో వెంటనే తొలగింపు చర్యలు మొదలు పెట్టాలని అక్రమణదారులను ఏ ఒక్కరిని ఒదిలిపెట్టొదని అధికారులను డిమేండ్ చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments