
ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి.
గ్రామీణ యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి
అంగన వాడి భవనాన్ని ప్రారంభించాన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జూన్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపెట్ మండలం పాపి రెడ్డి గూడ గ్రామంలో మైత్రి యువజన సంఘం వాలిబాల్ టోర్నమెంట్.. ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
గ్రామీణ ప్రాంతా యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని, ఏఆటలోనైనా గెలుపు,ఓటమి అనేది సహజం కాని చివరి వరకు పోరాడాలి అన్నారు. ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండలని అపుడే విజయం మన చెంతకి చేరితుందని అని అన్నారు.యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపున్యాభివృద్ది చేసుకొని చదువు , క్రీడలపై దృష్టి సారించాలన్నారు..అనoతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్ వాడి భవనాన్ని ఆయన ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసి విశాల శ్రవణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గూడ వీరశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్, శ్రీధర్ రెడ్డి, రమేష్, భాస్కర్ కరుణాకర్, నర్సింలు అనుసూయ, సురేష్ రెడ్డి, గిరి యాదవ్, తదితరులు పాల్గొన్నారు