
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 31
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండల జేఏసీ మండల కార్యదర్శి కాక సీతారామయ్య మాట్లాడుతూ రిలే నిరాహార దీక్ష 17వ రోజుకి చేరుకుంది. చింతూరు మండలంలో బినామీ పేర్లతో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని అయన అన్నారు, అలానే ఏజెన్సీ గ్రామాలలో సిమెంట్ ఇటుక బట్టీలతో మొదలుకొని అనేక వ్యాపారాలు ఏజెన్సీ గ్రామాలలో ఆదివాసులకే కేటాయించాలని, ఏదైతే జీవోలు చట్టాలు ఉన్నాయో అవి పగడబందిగా అమలు చేయాలని ఉన్నారు, ఆదివాసుల భావితరాల కోసం జేఏసీ చేస్తున్న న్యాయమైన ఉద్యమానికి శాశ్వత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చేస్తున్న జేఏసీ రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన గిరిజన సంఘం నాయకులు సీసం సురేష్, మడివి రవితేజ (అడ్వకేట్) ఆత్రం నవీన్ ( అడ్వకేట్) వేక లెనిన్, సోడే రాఘవయ్య, అనిగె చంద్రయ్య, కారం సాయిబాబు, మడివి రాజు, మీడియం నాగేష్, జల్లీ హర్ష, మడివి సాయి, తదితరులు పాల్గొన్నారు.