
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ మే30..
మన ఆదివాసి చట్టాలను జీవోలను రక్షించకపోతే ఆదివాసీ జీవన మనుగడే కరువైపోతుందని, రోజుకో చట్టాన్ని రోజుకో జీవోని తొలగిస్తూ 5వ షెడ్యూల్ ప్రాంతం నుండి ఆదివాసులను దూరం చేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న కుట్రగా పరిగణించాలని అన్నారు చింతూరు ఐటీడీఏ ఎదురుగా ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న 16వ రోజు దీక్షలో కూనవరం జడ్పిటిసి గుజ్జ విజయబాబు పాల్గొని తమ మద్దత్తు తెలిజేస్తూ ఆదివాసీ సమాజానికిపిలుపునిచ్చారు.16వ రోజు దీక్షలను శ్యామల సుబ్బయ్య మాస్టారు ప్రారంభించగా కూనవరం మండలం జగ్గవరం, అయ్యవారిగూడెం,కొండయిగూడెం,యూత్ మరియు పెద్దలు పాల్గొనగా యూత్ నాయకులు కరక రాజ్ కుమార్ మాట్లాడుతూ మాలాంటి ఆదివాసి నిరుద్యోగులు ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉన్నారని ఆదివాసి జేఏసీ చేస్తున్న ఈ దీక్షలకు ప్రతి ఒక్కరు భాగస్వాములుఅవ్వాలని,యువతరం తలుసుకుంటే ఎంతటి ప్రభుత్వాలైనా దిగిరావాల్సిందేనని యువతరం ఆదివాసీ జేఏసీ చేస్తున్న రిలే నిరాహార దిక్షలకు పాల్గొని మన సత్త ఏంటో పాలకులకు తెలియజేయాలనీ యూవతను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి జెఎసి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా,చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్, మండల ప్రజా ప్రతినిధులు కట్టం.లక్ష్మి, తెల్లం.నిరోషా, కరక.వెంకన్నబాబు, మడకం.పూర్ణ, అలాగే వీఆర్పురం నాయక పోడు సంఘం నాయకులు వేటకాని.మల్లయ్య,సోడే కన్నయ్య, మడకం మల్లయ్య, మిరియాల రమేష్, నూపా శేఖర్, మడకం శివ, సోడే జోగారావు, సోడే వీరబాబు, పద్దం రాజు, మడకం నాగరాజు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

