Wednesday, June 4, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదివాసీ జేఏసీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఆదివాసీ కొండ దొరల...

ఆదివాసీ జేఏసీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఆదివాసీ కొండ దొరల సంఘం

Listen to this article

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి. నరేష్ డివిజన్ ఇంచార్జి మే 20

అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ ఎదురుగా 6వ,రోజు రిలే నిరాహార దీక్షలు కార్యక్రమాని ఆదివాసి జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ పూలమాలల వేసి ప్రారంభించి అధ్యక్షత వహించారు.ఈ రిలే నిరాహార దీక్షలు సందర్భంగా ఆదివాసీ కొండ దొరల సంఘం అధ్యక్షులు దూసరి హరిబాబు మాట్లాడుతూ…2025 మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ఆదివాసీ టీచర్స్ పోస్టులు మినహాయించి 100% స్థానిక ఆదివాసీ పట్టభద్రులతోనే భర్తీ చేసేందుకు ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,తక్షణమే (టిఏసి)ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని,జీవో నెంబర్ 3కు చట్ట బద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు అరకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని,29 శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని,ఐటిడిఏల ద్వారా ట్రైకార్ రుణాలు నిరుద్యోగ యువతకు మంజూరు చేసి ఉపాధి కల్పించాలని మొదలైన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు.ఆదివాసి జేఏసీ మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరరావు
మాట్లాడుతూ…ఆదివాసీలే ఈ భూమికి భూమి పుత్రులు మరియు భారతదేశానికి ఆదివాసీలే తొలి స్వాతంత్ర్య సమరయోధులు అన్నారు.వారి పోరాటాలు ప్రాణ త్యాగాలు ఫలితంగా నేడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పేరా -4 ప్రకారం (టిఎసి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కమిటీ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించుకోవచ్చు అన్నారు.కావున ఆంధ్రప్రదేశ్ ఆదివాసి శాసనసభ్యులందరు ఆదివాసీ నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం కోసం తీర్మానం చేసి గవర్నర్ కి పంపించి అక్కడ నుండి రాష్ట్రపతి ఆమోదం కోసం తక్షణమే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పోడియం పండు దొర,చవలం శుభకృష్ణ దొర,పండా పవన్ కుమార్ దొర,మడకం వరప్రసాద్ దొర,ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,కారం రామన్న దొర,కారం చిన్ని కృష్ణ,బోరగ పొట్టిదొర,బలిజ చిన్నారెడ్డి,కత్తుల రత్న కుమారి, కుంజం అగ్గిదొర, పరదా వెంకన్నదొర,మడకం లచ్చన్న దొర బొగ్గుల సత్యనారాయణ రెడ్డి, సోళ్ళ రామిరెడ్డి, సిరుగుడు జగ్గారావు,పచ్చుకూరి అర్జనుడు,పచ్చుకూరి సాయి,టెంకి శ్రీను,శత్రుచర్ల జగన్,దూసరి ప్రసాద్,మన్నేపల్లి కనకారావు,మూలపర్తి ఈశ్వర్,కొట్టుం బన్ను,మేక సత్తిబాబు,దూసరి రమేష్,ఎస్.రవి,ఆయిల్ రాజు,శారపు నాగేశ్వరరావు,అందాల రత్నారెడ్డి, కారం చిన్ని కృష్ణ మరియు మహిళలు పచ్చుకూరి కృష్ణవేణి,మన్నేపల్లి సత్య,కుచల వెంకటలక్ష్మి,యలగాడ సూర్యకాంతం,ఈరేటి పోచమ్మ,సాపిరెడ్డి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments