
ఆదివాసీ జెఏసి డిమాండ్
పయనించే సూర్యుడు రిపోర్ట్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి జూన్ 3
ఆదివాసీ ట్రస్టా, మెటాఫోర్సా తేల్చి,సంబంధిత సభ్యులకు న్యాయం చేయవలసిన బాధ్యత ఆదివాసీట్రస్ట్ చైర్మన్ కోరాబు బాలం పడాల్, వైస్ చైర్మన్ కొయ్యం చిన్నబ్బాయి, సెక్రటరీ వండలం బాలయ్య లపై ఉందని ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు డిమాండ్ చేసారు.చింతపల్లి మండలం అంతర్లలో కోరాబు బాలం పడాల్ మెటాఫోర్స్ నెట్ వర్క్ బిజినెస్ చేస్తూ వేలాదిమందిని సమీకరించి సమావేశాలు ఏర్పాటు చేయడం పోలీసులకంటపడి ఆ బిజినెస్ కు సంబంధించిన రికార్డులను పోలీసులు తీసుకెళ్ళారని,పోలీసు అధికారుల సలహా మేరకు ఆదివాసీ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆదివాసీలకు సేవలు చేస్తూ మెటాపోర్స్ బిజినెస్ చేస్తున్నట్లు ఆదివాసీ ట్రస్ట్ సభ్యులు చెబుతుండేవారని,సభ్యులకు మెటాఫోర్స్ లో వచ్చే డబ్బులలో సభ్యత్వం,విరాళం వసూళ్లు చేస్తుండేవారు.ఇదంతా మోసం అని చెప్పినా ఒక ఉపాధ్యాయుడు మీద పోలీసు కేసు పెట్టారు.గూడెం కు చెందిన ఒక యూట్యూబర్ ట్రస్ట్ సభ్యుడిని ఇంటర్వ్యూ చేస్తే, ఆ సభ్యుడుకి ట్రస్ట్ కు పిలిచి హెచ్చరించారు,ట్రస్ట్ సభ్యులు యూట్యూబర్ ఇంటికి వెళ్లి మానసికంగా దాడి చేసారు.ట్రస్ట్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడిన వారిపైన ట్రస్ట్ సభ్యులు దాడికి సిద్దపడుతున్నారని భయపడేవారు.నెట్ వర్క్ బిజినెస్ సరిగ్గా నడవక పోవడంతోనే గత 6 నెలల నుండి సభ్యులకు కమీషన్లు (వారి భాషలో జీతాలు)ఇవ్వడం మానేసినట్లు తెలిసింది.మెటఫోర్స్ బిజినెస్ కు ఆదివాసి ట్రస్ట్ ముసుగు వేసి ఇన్నాళ్లు నడపడారు.ఆదివాసీ ట్రస్ట్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సెక్రటరీ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యోరోపణలు చేసుకుంటున్నారు. ట్రస్ట్ చైర్మన్ పడాల్ వైస్ ఛైర్మన్,సెక్రటరీల మీద కోటి 38 లక్షల 50 వేల రూపాయల ఆరోపణ,వైస్ చైర్మన్,సెక్రటరీ మిగతా సభ్యులు చైర్మన్ పడాల్ మీద 100 కోట్ల రూపాయల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధిత సభ్యులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ లను కోరారు.