
జి ఎస్ పి ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్.
పయనించే సూర్యుడు; జూన్ 12: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
నూగూరు వెంకటాపురం; ప్రభుత్వ భూములను కాపాడటంలో రెవిన్యూ యంత్రాంగం విఫలం అయ్యిందని,భూమి దక్కేవరకు ఉద్యమం ఆగదనీ,
రెవిన్యూ భూమి కాపాడటంలో రెవిన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలం అయ్యారనీ,గొండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెంప్రతాప్ ఆరోపించారు.గురువారం నాడు కొమరం భీం కాలని ఆదివాసులతో సమావేశం ఏర్పాటు చేసి,గొండ్వాన సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్ మాట్లాడుతూ,వాడగూడెం (జి) సర్వే నెంబర్ 27 లో వంద ఎకరాల ప్రభుత్వ భూములను ఫారెస్ట్ శాఖకు ధారధత్తం చేశారని అన్నారు.అదే సర్వే నెంబర్ 27 లో కొమరంభీమ్ కాలని ఆదివాసులు పొడు కొట్టు వ్యవసాయానికి అనుకూలంగా భూమి మార్చుకొని సాగు చేస్తుంటే రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డు ఎందుకు పెట్టారని సూటిగా ప్రశ్నించారు.గతంలో అదే భూమిలో గిరిజనేతరులు, ఆదివాసులని అడ్డుకుని చుట్టూ బౌండరీలు ఏర్పాటు చేస్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని సూటిగా ప్రశ్నించారు.ఇది కేవలం రాజకీయ ప్రలోబాలతో ఆదివాసులకు భూమిని దక్కకుండా అధికారులు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ కుట్రను గొండ్వాన సంక్షేమ పరిషత్ తిప్పి కొడుతుందని హెచ్చరించారు.కొమరం భీం కాలని ఆదివాసులకి భూమి దక్కెవరకు ఈ ఉద్యమం ఆపబోమని ఆయన తెలిపారు.ఈయొక్క కార్యక్రమంలో కొమరం భీం కాలని ఆదివాసులు, తదితరులు పాల్గొన్నారు.