
పయనించే సూర్యుడు జూన్ 02 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బొజ్జాయిగూడెం నందు గల ఎస్.ఎస్.గార్డెన్ లో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ అందజేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకోరం కనకయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్లు నిండాయి. ఈరోజు రాష్ట్రమంతటా ఆవిర్భావ వేడుకలు వైభవంగా జరుపుకుంటున్న ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు అభినందనలు. సర్వాష్ట సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఎందరి ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు వీర జిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్న పెద్దలందరికీ… పేరుపేరునా ప్రణామాలు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ సాధనలో ముందుండి నడుస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, సాధికారతను సమన్వయం చేస్తూ ప్రతి పేదవాడి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు రాష్ట్ర నలుమూలలకు ఎక్కడ నుండి ఎక్కడికైనా ఎలాంటి ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని మన ప్రభుత్వం కల్పించింది. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ నిరుపేద 34,250 మంది ఆడబిడ్డలకి గ్యాస్ సబ్సిడీ కనెక్షన్లు మంజూరి చేసింది. రైతు భరోసా ద్వారా 21, 492 మంది రైతులకు ₹ 166.74 కోట్ల పెట్టుబడి సాయం అందజేయడం జరిగింది. గృహలక్ష్మి- ఇందిరమ్మ ఇండ్లు పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేసి, ఈరోజు వాటి మంజూరి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గ ఐటీడీఏ గిరిజన ప్రాంతం అయినందువలన అదనంగా 1500 ఇల్లులు మంజూరు చేయడం జరిగింది.ప్రజలకు నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా జిల్లాలో 10 కోట్ల పది లక్షలతో నాలుగు 33/11 కెవి సబ్ స్టేషన్లు మంజూరి చేయడం జరిగింది అట్టి పనులు పురోగతిలో ఉన్నాయి.200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న 36,58 మందికి ఉచిత విద్యుత్ అందిస్తూ ప్రభుత్వమే విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తుంది. చేయూత పథకం ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజలకు మెరుగైన కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సహాయాన్ని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. నియోజకవర్గ పరిధిలోని అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబాలకు సుమారు 4 కోట్ల 78 లక్షల గాను 1704 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వైద్యం కూడా చేయించుకోలేని నిరుపేద కుటుంబాలకు మీన్స్ హాస్పిటల్ నందు ఎల్ఓసి ద్వారా సుమారు 80 మందికి 1 కోటి 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నియోజకవర్గంలోని గిరిజన, పేద, బడుగు, బలహీన, సామాన్య, మధ్యతరగతి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి మరియు విద్యార్థులను సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలలో శిక్షణ ఇవ్వడం కోసం 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయడం జరిగింది. రైతుల భూ సమస్యలు పరిష్కరించడానికి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చాము. భూభారతి చట్టం ద్వారా జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు దరఖాస్తుల స్వీకరించుట కొరకు మరియు చట్టం మీద గ్రామస్థాయిలో అవగాహన కల్పించేందుకు రేపటి నుంచి అంటే జూన్ మూడవ తారీకు నుంచి 20వ తారీకు వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించుటకు ఏర్పాటు చేశాము. రైతులకు రెవెన్యూ సేవలు సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రతి రెవిన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారి గ్రామ పాలన అధికారులను మరియు సర్వేయర్లను అతి త్వరలో నియమించడం జరుగుతుంది.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, మనమందరం కలిసి తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ, నియోజకవర్గ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు