Friday, June 13, 2025
Homeఆంధ్రప్రదేశ్ఇందిరమ్మ ఇళ్ళకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇందిరమ్మ ఇళ్ళకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

Listen to this article

పండగ వాతావరణంలా మారినఇల్లందు పట్టణం

ముస్తాబైన మున్సిపాలిటీలోని పుర వీధులు

ఆనందంతో ఆత్మీయ స్వాగతం పలికినగూడులేని నిరుపేదలు

కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు సాధ్యమన్న… ఎమ్మెల్యే కోరం

పయనించే సూర్యుడు జూన్ 12 (పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం మొదటి విడతలో భాగంగా నేడు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు చెందిన లబ్ధిదారుల ఇంటి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలకుఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై పలు వార్డుల్లో శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ లబ్దిదారులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇంటినిర్మాణం చేపట్టాలని. నియోజకవర్గ వ్యాప్తంగా గతంలోనూ మరియు ఇప్పుడు తన హయాంలోనే నిరుపేదలకు పక్కా గృహాలు మంజూరు కావడం నా పూర్వజన్మ సుకృతంగ భావిస్తున్నానని,కులాలకు, మతాలకు,పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు ప్రక్రియ చేపట్టడం ద్వారా నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు అందాయని అన్నారు. 24వార్డుల్లో పెద్దయెత్తున స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీ.ఈ, ఏ.ఈ ,మున్సిపల్ చైర్మన్. దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, కమిషనర్ శ్రీకాంత్, డీ.ఈ మురళీ,ఇల్లందు డీఎస్పీ. చంద్రభాను,సీఐ.బత్తుల సత్యనారాయణ, ఎస్.ఐ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దొడ్డా డానియెల్,జనరల్ సెక్రటరీ మొహ్మద్ జాఫర్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసం లక్ష్మణ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు,24 వారులకు చెందిన వార్డు అధికారులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,పట్టణ,మండల సీనియర్ కాంగ్రెస్,యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments