
పయనించే సూర్యుడుజూన్ 10 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమం మంగళవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ ఇళ్ళ లభిదారుల పట్టాల పంపిణీ ప్రొసీడింగ్స్ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ప్రతీ పేదవానికి సొంతింటి కల కలలాగే మిగిలిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లకు సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. మొదటి విడతలో పేర్లు రానివారు నిరాశ చెందవద్దని,ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ విడతల వారీగా ఉంటుందని,మిగిలిన లబ్దిదారులు నిరాశ చెందకుండా ఇండ్లు వస్తాయని వారి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో. తహశీల్దార్ వీరభద్రం, ఎం.డీ.ఓ గాంధీ,టేకులపల్లి సీఐ సురేష్,బోడు ఎస్. ఐ శ్రీకాంత్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు .కోరం సురేందర్,ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బాణోత్ రాంబాబు,టేకులపల్లి మండల అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్, సొసైటీ డైరెక్టర్ ఉల్లోజి ఉదయ్,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్,మొకాళ్ళ పోషాలు,మూడ్ సంజయ్,ఇస్లావత్ రెడ్యా నాయక్, బాణోత్ భద్రు, బోడా మంగీలాల్ నాయక్,బుర్రా ధర్మయ్య గౌడ్,గడ్డం మదు రెడ్డి,రావూరి సతీష్,భూక్యా సర్దార్, తదితరులు పాల్గొన్నారు.