
పయనించే సూర్యుడు ఏప్రిల్ 27( పొనకంటి ఉపేందర్ రావు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పూబల్లి పంచాయతీలో పైలెట్ ప్రాజెక్టు కింద 83 ఇల్లులు మంజూరు చేయడం జరిగినది. ఇందిరమ్మ ఇల్లుల లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ నిర్మాణ పనులు పరిశీలించిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు బేస్మెంట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులు దగ్గరుండి మరి పరిశీలించి నాణ్యతగా కట్టుకోవాలని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మాజీ ఎంపిటిసి పూణెం సురేందర్, డి శివ, బానోత్ శారదా, నరసింహారావు, ధనుంజయ్, చీమల బక్కయ్య, జోగ శ్రీకాంత్, అధికారులు ఏఈ డేవిడ్, సెక్రటరీ బాలకృష్ణ, గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు