Sunday, March 16, 2025
Homeఆంధ్రప్రదేశ్ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్

ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 16 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

అంతరిక్షంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్‌మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. నాసా ప్రకారం.. భూమి మీదకు ఈ నెల 19, 20 తేదీల్లో తిరిగి రావొచ్చునని స్పష్టం చేసింది. పది నెలలుగా అంతర్జాతీ య అంతరిక్ష కేంద్రం ఐ యస్ యస్ లో ఉంటున్న ఈ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు రెడీ అవుతు న్నారు.గత కొన్నినెలల క్రితమే 58 ఏళ్ల సునీతా విలియమ్స్, 61 ఏళ్ల విల్‌మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్షనౌకలో అంతరిక్షానికి పయనమై య్యారు. కొత్త వ్యోమనౌక పనితీరును పరీశీలించేందుకు సునీతా, విల్‌మోర్‌ స్పేస్‌కు వెళ్లారు. కానీ, ఊహించని పరిణా మాలతో జూన్ 5న ఫ్లోరిడా లో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి. నాసా అధికారులు ఈ సాంకేతిక సమస్యలను అర్ధం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం శూన్యం.. చేసేది ఏమిలేక వ్యోమగాములను అంతరిక్ష నౌకలోనే వదిలేసి స్టార్ లైనర్ సెప్టెంబర్ 7, 2024న భూమిపైకి తిరిగి వచ్చింది. ఆ పరిస్థితుల్లో భూమిపైకి ఇద్దరు వ్యోమగాములను తీసుకురావడం ప్రమాద కరమని నాసా భావించింది.
ఆ తర్వాత విల్‌మోర్‌, సునీత విలియమ్స్ ఇద్దరూ అంతరిక్షంలోనే ఉండిపో వాల్సి వచ్చింది. ముందుగా స్పేస్ ఎక్స్ డ్రాగన్‌ ద్వారా వారిద్దరిని భూమిపైకి తీసుకురావాలని భావించారు. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వీరిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్‌కు అప్పగించారు.
నాసా ప్రకారం.సునీతా, విల్ మోర్ ఈ నెల 19, 20 తేదీల్లో భూమిపైకి తిరిగి రావచ్చు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments