
పయనించే సూర్యుడు; జూన్ 24: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి రామ్మూర్తి.ఎ.
వాజేడు; ములుగు జిల్లా వాలేరు మండలం లోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనిడాక్టర్ రాహిల్ ఆధ్వర్యంలో చింతూరు మరియు కోరకల్ గ్రామాలలో ప్రభుత్వ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగినదనీ పేరూరు ప్రాథమిక ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ వివరించారు. ఈ యొక్క కార్యక్రమంలోచింతూరుగ్రామంలో జరిగిన వైద్య శిబిరంలో 65 మందికి పరీక్ష చేయడం మరియు చికిత్స చేయడం జరిగినది ఈ యొక్క శిబిరం నందు జీవన శైలిలో వచ్చిన మార్పులు వలన వచ్చిన వ్యాధులు అనగా బీపీ మరియు షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువమందిని పరీక్షించి చికిత్స చేయడం జరిగినది తెలియజేశారు. అంతేకాకుండాబిపి అనునది వ్యాధి లక్షణాలను బట్టి గుర్తించలేం కాబట్టి పరీక్షల ఆధారంగా వచ్చిన రీడింగ్ ను బట్టి గుర్తించవచ్చుఅని గ్రామస్తులకు వివరించారు. అదేవిధంగా గ్రామస్తులతో మాట్లాడుతూ,నియంత్రణలో లేకుండా ఎక్కువగా బిపి ఉన్నా కూడా ఇప్పటివరకు బీపీ మందులు వాడని వారిని గుర్తించి మొదటిసారిగా చికిత్స పెట్టుట మరియు బీపీ కి చికిత్స తీసుకుంటున్న వారు నియంత్రణలో లేకపోవడం వలన మోతాదు పెంచి మందులు వేసుకోమనీ గ్రామస్తులకు సూచించారు.నియంత్రణలో లేని బీపీ కేసులను సిహెచ్ సి ఏటూరు నాగారం నకు రిఫర్ చేయుట జరుగుతుందని గ్రామస్తులకు వివరించారు.ఎనిమిది మంది జ్వరపీడుతలను గుర్తించి పరీక్ష చేసి చికిత్స చేయుట జరిగినది ఎటువంటి మలేరియా నిర్ధారణ కాలేదనీ,గర్భవతులను కూడా పరీక్షించి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినదనీ ఆసుపత్రిలోనే ప్రసవం కావాలని తెలియజేయడం జరిగినదనీ,గ్రామాలలో జ్వర తీవ్రత పెరిగిన సంబంధిత ఆరోగ్య కార్యకర్తలు సమాచారం ఇవ్వాలని జ్వరం వచ్చిన ప్రతి వ్యక్తి ఆసుపత్రి లో ఇచ్చే చికిత్సను సద్వినియోగపరుచుకోవాలని తెలియజేయటం జరిగినదనీవాతావరణ మార్పుల వలన జలుబు దగ్గు తలనొప్పితో జ్వరం వస్తుంది కాబట్టి కాచి చల్లార్చిన నీరు వేడివేడి ఆహార పదార్థాలు మంచి పోషకాహారం తీసుకోవాలని తెలియజేసామనికొరకాల్ నందు నిర్వహించిన శిబిరం నందు 36 మందికి వైద్య పరీక్షలు చేసి చికిత్స చేయడం జరిగినదనీ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈయొక్కకార్యక్రమంలో హెచ్ ఇ ఓ వేణుగోపాలకృష్ణ, హెచ్ ఏ శ్రీదేవి, హెచ్ ఏ జయంతి లాల్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
