
పయనించే సూర్యుడు మే 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి నిన్నేపల్లి తిరుపతయ్య)
10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామం వైఎస్సార్సీపీ నాయకులు ఉడత .చిన్న రత్నయ్య కుమార్తె ఉడత .అనూషను మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అభినందించారు.ఇటివల విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో చేజర్లలోని లుంబిని విద్యాలయంలో చదువుతున్న ఉడత. అనూష 594 మార్కులు సాధించారు. దీంతో నెల్లూరులోని మేకపాటి నివాసంలో విద్యార్థిని మాజీ ఎమ్మెల్యే మేకపాటి ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో అత్యుత్తమస్థాయికి చేరేందుకు విద్య ఒక్కటే మార్గమని, కష్టపడి చదవాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆ విద్యార్థినిప్రోత్సహించారు. ఆయన వెంట నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు.