Tuesday, August 19, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎం ఈ ఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన

ఎం ఈ ఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయుల ఆందోళన

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

కూకట్ పల్లి, బాలానగర్ మండల విద్యాధికారుల ఎం ఈ ఓ పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారింది. ఏకంగా మండల విద్యాధికారి కార్యాలయాన్ని తమ ఎం ఈ ఓ కు అప్పగించాలని కూకట్ పల్లి మండల ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కూకట్ పల్లి మండలానికి చెందిన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూకట్ పల్లి పరిధిలోగల మండల విద్యాధి కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.కూకట్ పల్లి మండలం కు చెందిన మండల విద్యాధికారి కార్యాలయం లో గత కొంత కాలంగా బాలనగర్ ఎం ఈ ఓ తిష్ట వేశారు. దీంతో కూకట్ పల్లి ఎం ఈ ఓ కు కార్యాలయం లేకుండా పోయింది. కూకట్ పల్లి మండలానికి ఎం ఈ ఓ కార్యాలయం ఉండి కూడా లేనట్లే అయింది. కూకట్ పల్లి మండల పరిధిలోగల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఉపాధ్యాయులకు అందించే బోధన సామాగ్రి, డిజిటల్ యంత్ర పరికరాలు పెట్టుకోవడానికి కార్యాలయం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్ బిల్స్ , రిటర్మెంట్ అయిన ఉపాధ్యాయుల సర్వీస్ బుక్స్ జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కూకట్ పల్లి ఎం ఈ ఓ కార్యాలయానికి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చి ఎవరు అందుబాటులో లేకపోవడం తో డోర్ లాక్ అంటూ తిరిగి వెళ్లడం జరుగుతుందని ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా మండల విద్యాధికారి విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏదైనా ఒక ప్రొసీడింగ్ తీయాలన్నా, మండల పరిధిలో విద్యా వ్యవస్థ పై ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలన్న కనీసం కార్యాలయం లేకపోవడంతో ఉపాధ్యాయులు ,ఎం ఈ ఓ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కూకట్ పల్లి మండల పరిధిలో గల ఎం ఈ ఓ కార్యాలయమును కూకట్ పల్లి అధికారులకు అప్పగించాలని మండలం లో ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. అయినా ఎవరు స్పందించకపోవడం తో ఉపాధ్యాయులు తమ నిరసనను తెలియజేశారు. ఇకనైనా ఉన్నత అధికారులు బాలానగర్ లోని ఎం ఈ ఓ కార్యాలయానికి సదరు ఎం ఈ ఓ ను పంపించాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments