
పయనించే సూర్యుడు గాంధారి 08/04/25 పి ఎం శ్రీ జెడ్ పి హెచ్ ఎస్ గాంధారి 6వ ,7వ తరగతి విద్యార్థులు ఎక్స్పోజర్ విజిట్ 2 ఫేజ్ లో భాగంగా డిచ్పల్లి ఖిల్లా రామాలయం, నర్సింగ్ పల్లి, సారంగాపూర్, బాసర సరస్వతి ఆలయాలు సందర్శించడం జరిగింది. చారిత్రక కట్టడాలు , పురాతన ఆలయాలు సందర్శించడం వల్ల నిర్మాణ శైలి, శిల్పుల నైపుణ్యత ఆనాటి చారిత్రక విషయాలు శిలాశాసనాల ద్వారా తెలుసుకోవచ్చని ప్రధానోపాధ్యాయులు శ్రీ రంగా వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. విజ్ఞానాన్ని పెంపొందించే ఈ సందర్శనలో ఉపాధ్యాయ బృందం శ్రీదేవి, శంకర్ గౌడ్,శరణ్య ,సంగీత, నాగలక్ష్మి ,సాయిలు, శ్రీనివాస్ మరియు విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంతో ఆనందంగా పాల్గొన్నారు.