
(సూర్యుడు సెప్టెంబర్ 26 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం దొమ్మాట ZPHS. స్కూల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ అండ్ టు ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక శిబిరం 5వ రోజు భాగంగా దొమ్మాట స్కూల్లో ఆవరణలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు తమ ఉత్సవంతో అక్కడ ఉన్న పిచ్చి మొక్కలను తీసివేస్తూ పరిశుభ్రతను క్లీన్ చేస్తూ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్క ఊరిలో ఇంటిపక్కల మురికి ఉండకుండా చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం. మంగాత నాయక్ మరియు సంపత్ కుమార్ పాల్గొని ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ శనమదానంతో పాటు సామాజిక సేవ పట్ల అవగాహన పెంపొందించుకొని సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని భావనతో ఈరోజు దొమ్మాట హైస్కూల్లో శ్రమదానం చేయడం జరిగింది ప్రతి ఒక్క ఊరిలో మంచి సేవలు చేయాలి అనే భావన ముందుకు తీసుకెళ్లాలని ఎన్ఎస్ఎస్ సిబ్బంది ప్రోగ్రామ్ ఆఫీసర్ సూచించడం జరిగింది.
