
పయనించే సూర్యుడు మే 27 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు తెలంగాణ మలి దశ ఉద్యమంలో పనిచేసిన ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డుకు చెందిన ఎస్.కె మహబూబ్ గుండెపోటు తో మరణించగా ఆ విషయాన్ని తెలుసుకున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ హరిప్రియ నాయక్, ఎస్.కె మహబూబ్ కుటుంబాన్ని పరామర్శించి వారి సతీమణికి 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో. జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్,
ఎస్ రంగనాథ్,జె కె శ్రీను, ఎర్రబెల్లి కృష్ణయ్య, చైర్మన్ అజ్మీర్ భావ సింగ్ నాయక్, అబ్దుల్ నబీ, మహమ్మద్ అబ్దుల్ జబ్బార్, గిన్నారపు రాజేష్,తదితరులు పాల్గొన్నారు.