Sunday, June 8, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియమక చట్టాన్ని ప్రకటించాలి //ఆదివాసి జేఏసీ చేస్తున్న 13 వ రోజు...

ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియమక చట్టాన్ని ప్రకటించాలి //ఆదివాసి జేఏసీ చేస్తున్న 13 వ రోజు దీక్షలను ప్రారంభించిన మాజీ ఎంపీపి బిజెపి జిల్లా కార్యదర్శి పాయం వెంకయ్య

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 27

అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ ముందు 13వ,రోజు రిలే నిరాహార దీక్షలు కార్యక్రమానికి ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి.నరేష్ అధ్యక్షత వహించి రిలే నిరాహార దీక్షలకు హాజరైన వారికి బీజేపీ జిల్లా కార్యదర్శి పాయం వెంకయ్య పూలమాలవేసి స్వాగత ఉపాన్యాసంతో ప్రారంభించారు.ఈ రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి ఆదివాసీ జేఏసీ రాష్ట్రా కార్యదర్శి కుంజా అనిల్,పేసా ఉపాధ్యక్షులు కారం సాయి మాట్లాడుతూ…2025 మెగా డీఎస్సీ నుండి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ టీచర్స్ పోస్టులు మినహాయించి,తక్షణమే 100% స్థానిక ఆదివాసీ పట్టభద్రులతోనే భర్తీ చేసేందుకు ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,తక్షణమే (టిఏసి)ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి సభ్యులుతో కమిటీతో తక్షణమే తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని,జీవో నెంబర్ 3కు చట్ట బద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు అరకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివాసీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని,వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటిడిఏల ద్వారా ట్రైకార్ రుణాలు నిరుద్యోగ యువతకు తక్షణమే మంజూరు చేసి ఉపాధి కల్పించాలని మొదలైన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు పెద్ద సీతనపల్లి,ఎర్ర పేట గ్రామాల యువత,ఉద్యోగులు,నిద్యోగులు, సర్పంచ్,మరియు గ్రామస్తులు అందరం సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు.అలాగే మాట్లాడుతూ…ఆదివాసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భారత రాజ్యాంగంలోని ఐదవ,ఆరవ షెడ్యూల్డ్ లోని
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పేరా -4 ప్రకారం (టి.ఎ.సి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కమిటీ ఏర్పాటు చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించి ఆదివాసీ నిరుద్యోగ పట్టభద్రుల భవిష్యత్తును కాపాడాలని టి.ఏ.సి కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులకు మరియు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ రిలే నిరాహార దీక్షలు మడకం.లక్ష్మణ్,మడివి.చందు,సోడి వీర,కారం చందు,మడివి.రాజు,పండ్రుమ్.మహేష్ యువత పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments