
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం ఐసిడిఎస్ టేకులపల్లి సెక్టార్ పరిధిలోని బేతంపూడి పంచాయతీ బేతంపూడి స్టేజి తండాలో శుక్రవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల ఎనిమిది నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఈ నెల 22 వరకు జరగనున్నాయి. అందులో భాగంగా టేకులపల్లి సెక్టార్ సూపర్వైజర్ కె.అనురాధ ఆధ్వర్యంలో బేతంపూడి జీపీ లోని స్టేజతండా అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం పోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ టేకులపల్లి ప్రాజెక్టు అధికారి కే.యం, తారా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లులకు 1000 రోజులు గురించి, పోషకాలు వున్నా ఆహారం తీసుకోవాలని, తల్లులకు అవగాహన కల్పించారు. అలాగే తల్లులతో చిరు ధాన్యాలతో వంట చేయించడం, అన్నప్రాసన, అక్షర బ్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ సుగుణ, లలితకుమారి, అరుణకుమారి, వెంకటనర్సమ్మ, గర్భిలు, బాలింతలు, కిశోర బాలికలు, పిలల్లు పాల్గొన్నారు.