Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ ధాఖలైంది, ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటిం చాలని కోరుతూ వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంధ సంస్థ తెలంగాణ హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్ హెచ్‌సీయూ భూముల అంశం ప్రస్తుతం రాజకీయ టర్న్ తీసుకుంది. ఈ భూములు ప్రభుత్వా నివేనని టీజీఐఐసీ సోమ వారం ప్రకటన విడుదల చేసింది. హెచ్‌సీయూలో సర్వే నిర్వహించలేదని ఆ సంస్థ రిజిస్ట్రార్ ప్రకటించారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ నాలుగు వందల ఎకరాలను 2003లో అప్పటి ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే కంపెనీకి కేటాయించింది. అయితే ఈ భూమిపై న్యాయపోరాటం చేసి ఈ భూమిని స్వాధీనం చేసు కున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అయితే ఈ భూమితో హెచ్‌సీయూకు ఎలాంటి సంబంధం లేదని కూడా ప్రభుత్వం చెబుతోంది. ఈ భూమిని విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హెచ్ సీ యూలోని విద్యార్ధి సంఘాలు కూడా ఈ భూ మల విక్రయాన్న నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments