
పయనించే సూర్యుడు మే 31 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
సుండుపల్లె నుండి మహానాడుకు భారీగా తరలి వెళ్ళిన తెలుగు తమ్ముళ్లు సత్తా చాటారు,,,
సుండుపల్లి తెలుగు తమ్ముళ్లకు అండగా ఉంటా,,
రాజంపేట నియోజక ఇంచార్జి మరియు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు.
సుండుపల్లి మండలం.
శనివారం సుండుపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కడపలో జరిగిన మహానాడు సభ విజయవంతం చేయడంపై రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు శ్యాలువా కప్పి పూలమాలవేసి ఘనంగా సన్మానించారు. అనంతరం చమర్తి మాట్లాడుతూ కడపలో జరిగిన మహానాడు ను ప్రతి ఒక్కరూ ప్రతిష్టత్మకంగా తీసుకొని ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లు మరియు మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కరూ విజయవంతం చేసినందుకు వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా సుండుపల్లి మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడై అందరూ ఏకతాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జెండా రెపరెపలాడాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కళ్ల రెడ్డప్ప , టిడిపి ముఖ్య నాయకులు, మండల సీనియర్ నాయకులు శివరాం నాయుడు ఎక్స్ ఎంపీటీసీ మోహన్ బాబు అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ నాయుడు కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.