Saturday, June 14, 2025
Homeఆంధ్రప్రదేశ్కలెక్టర్ సాబ్ అక్రమ కట్టడాల కూల్చివేతలో ఏం జరుగుతుంది*

కలెక్టర్ సాబ్ అక్రమ కట్టడాల కూల్చివేతలో ఏం జరుగుతుంది*

Listen to this article

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరుడివిజన్ ఇంచార్జి జూన్13

కూల్చివేతల విషయంలో రంపచోడవరం,మారేడుమిల్లి ప్రాంతాలకు ఒక న్యాయం చింతూరు ఉప డివిజన్ కి ఒక న్యాయమా

  • మండల ప్రధాన కేంద్రాలలో ఆదివాసులకు చిన్న గుడిసె లేనిది వలస గిరిజనేతరులకు ఒక్కొక్కరికి 1/70చట్టానికి వ్యతిరేకంగా ఒకటి నుండి ఐదు షాపులు మరియు బహుళ అంతస్థ నిర్మాణాలు ఎక్కడివి?అధికారులారా మీరే మా సమాజానికి సమాధానం చెప్పాలి చింతూరు ఎర్రంపేటలో ఉన్నది సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ లేక గిరిజనేతర అభివృద్ధి సంస్థ అన్న సందేహాలు మాకు ఉన్నాయి వీటికి బదులు మీరే చెప్పాలి ఆదివాసి ప్రాంతంలో మా ఆదివాసులకు జరగని న్యాయం చిటికలో గిరిజనేతరులకు ఎలా జరుగుతుంది.రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏజెన్సీ అభివృద్ధి కోసం షెడ్యూల్డ్ ప్రాంత ప్రజలందరూ అభివృద్ధి దిశగా అడుగులు పెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వ ఆస్తులను ఏజెన్సీ ఆస్తులను అక్రమంగా దోచుకుంటున్న గిరిజనేతరాలను ఈ ప్రాంతం నుండి తరిమేయాలని ఉద్దేశంతో రోడ్ల నిర్మాణం పేరుతో అక్రమనలను తొలగించే ప్రక్రియ చేపడితే స్థానిక అధికారులు ఎవరికి వారు మా అమాయక ఆదివాసి ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తూ మోసం చెయ్యాలని చూస్తే ఖబడ్దార్ ఎవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆదివాసి జెఏసి రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా 30వ రోజు దిక్షలలో అధికారులను డిమేండ్ చేశారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ గౌరవ సుప్రీంకోర్టు మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ అండ్ బి స్థలాల ఆక్రమణలు మరియు ఇతర ప్రభుత్వ భూములు, కాలువలు చెరువులు బరియల్ గ్రౌండ్లో లోని అక్రమ కట్టడాలను నాలుగు వారాల్లో తొలగింపు ప్రక్రియను పూర్తి చేస్తామని మొదట్లో ఎంతో చిత్తశుద్ధితో మాట్లాడిన జిల్లా కలెక్టర్ కి ఆ ఊపు ఉత్సాహం ఏమైందని,కొంతమంది ఆదివాసి ద్రోహులైన ఆదివాసి ప్రజాప్రతినిధులు మరియు ఆక్రమదారులైనటువంటి గిరిజనేతరులు యొక్క అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని చాలా కూల్చివేతలు నిలిపివేసి గిరిజన యేతర అక్రమ కట్టడాలకు మినహాయింపు ఇవ్వటం వెనుక కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారుల మర్మం ఏమిటో బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేయాలని ఆదివాసి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ కుంజా అధికారులను డిమేండ్ చేసారు. చట్టం ఉల్లంఘనలో వున్న నాన్ ట్రైబల్ పై అధికారులకి,ప్రజాప్రతినిధులకి అంత ప్రేమ ఎందుకో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వంని కోరారు.ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అధికారులు, అమలకు చర్యలు తీసుకోవలసినటువంటి ప్రజాప్రతినిధులు నాన్ ట్రైబల్ కి కొమ్ముకాస్తూ, ఏజెన్సీ చట్టాలను నాన్ ట్రైబల్ కీ తాకట్టు పెట్టి ,అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కాసులుకు కక్కుర్తి పడుతున్నారని ఆరోపణ చేశారు. ఒక జిల్లా కలెక్టర్ స్వయంగా మొత్తం కూలిస్తే నాన్ ట్రైబల్ వ్యాపారాలకు వాళ్ల నివాసాలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పటం ఎంతవరకు సబబు?, చట్టం ఉల్లంగించిన వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్లని తొలగించకుండా కాపాడుకోవడం వాళ్లకి వత్తాసుగా కలెక్టర్ స్టేట్మెంట్ ఇవ్వటం ఆదివాసుల దురదృష్టకరమని, ఇటువంటి అధికారుల నిర్లక్ష్యం వలనే, మరియు స్థానిక అధికారుల చేతివాటంతోనే 1/70 చట్టం అమల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో చట్టానికి విరుద్ధంగా వలసలు పెరిగి నాన్ ట్రైబల్ అక్రమ కట్టడాలు వ్యాపార సముదాయాలు వెలిశాయని ఇది ఆదివాసుల ఉనికికి ప్రమాదము అని ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివాసి ప్రజాప్రతినిధులు ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన చట్టాల వైప లేక ఓట్ల కోసం గిరిజనేతరులు ఇచ్చే కాసులు కోసం కక్కుర్తి పడి ఆదివాసులకు మోసం చేస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. అలాగే చింతూరు డివిజన్లోని చింతూరు, ఎర్రం పేట ఐటీడీఏ పరిధిలో నోటీసులు ఇచ్చి హడావుడి చేసిన ఐటీడీఏ ,రెవిన్యూ ,పంచాయతీ అధికారులు. కొంతమంది నాన్ ట్రైబల్స్ స్వతగా ఒకటి రెండు రేకులు తీసేయగానే పూర్తిగా అక్రమ కట్టడాలను కూల్చకుండా ఆపివేయడం వెనక అంతర్యం ఏమిటో తెలియజేయాలని,వాళ్ళకి 10 మీటర్ల వరకే తగ్గించడం వెనక కారణమేమిటని,ఎంత ముడుపులు ముట్టాయో తెలపాలని ప్రశ్నించారు. గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం,రాజమండ్రి వంటి ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి కొంతమంది గిరిజనేతరులు ఐటీడీఏ లోనీ పలు కాంట్రాక్టు పనులు చేస్తూ. చింతూరు ఐటిడిఏ అధికారులను గుప్పెట్లో పెట్టుకొని తమకు నచ్చినట్టు పని చేయించుకుంటూ చివరికి ఆదివాసి చట్టాలు కూడా తూట్లు పొడుస్తూ గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు వారి ఆదేశాలు కూడా అమలు కాకుండా చేయగలిగారంటే చింతూరులో ఉన్న బడా గిరిజనయేత్రుల యొక్క రాజకీయ బలం ,డబ్బు బలం ఎంతుందో అర్థమవుతుందని, వారి ముందు అధికారులు కూడా దిగదుడిపే అని అర్థమైందని అన్నారు.పంచాయతీ అధికారుల నుండి ఐటీడీఏలో ఉన్న ఐఎయస్ అధికారులను సైతం తమ గుప్పెట్లో పెట్టుకుని గిరిజనేతరలు చింతూరులో తమ ఉనికిని చాటుతున్నారని దీని మూలాన ఆదివాసీలకు, ఆదివాసి చట్టాలకు ఉనికి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తపరిచారు.చింతూరు ఎర్రంపేట కేంద్రాల తో పాటు చింతూరు డివిజన్లోని వర రామచంద్రపురం, కూనవరం, ఎటపాక మండలాల్లో వున్న అన్ని అక్రమ కట్టడాలు తక్షణమే కూల్చివేత మొదలు పెట్టాలని లేకపోతే అధికారులకి చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి గ్రామం నుండి ఆదివాసీలు రెవెన్యూ ,పంచాయతీ, ఐటీడీఏ, జిల్లా అధికారుల కు మరియు ఆదివాసి ప్రజాప్రతినిధులకు అలాగే అక్రమ కట్టడం దారులైన గిరిజయేతరులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు మొదలు పెట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్,మడివి.రాజు, కారం చందు, కారం.సాయి, సవలం.భద్రయ్య, మడివి. సాయి. కారం శంకురమ్మ, తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments