పయనించే సూర్యుడు {అక్టోబర్ 28} మక్తల్:
మక్తల్ పట్టణంలోని రాంలీలా మైదానంలో సోమవారం రాత్రి బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో రాష్ట్ర పాడి పశుసంవర్ధక డెయిరీ క్రీడా యువజన మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వారి సతీమణి వాకిటి లలితతో కల్సి హాజరై కార్తీక దీపాలను వెలిగించారు, అనంతరం కార్తీక దీపోత్సవం వాటి విశిష్టత గురించి వివరించారు. హిందూ ధార్మిక ప్రకారం కార్తీక మాసం విశిష్టమైందని ప్రకృతి పరంగా వర్షాలు కురిసి పచ్చదనంతో వికసించిన పూలతో ప్రకృతి పరవశించిపోతూ భక్తులను కనువిందుగా చేసి ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకుపోయే మాసం కార్తీక మాసం అని అన్నారు కార్తిక మాసం నెలలో మనిషి యొక్క దిన చర్య ప్రవర్తనను మార్చి సైంటిఫిక్గా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగాను దైనందికంగాను దారి చూపుతోందని తెలిపారు ప్రతి ఒక్కరు తెల్లారు జామున చల్లటి నీటితో స్నానం చేయడంవల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు దేవాలయంలో నెయ్యితో తోదీపం వెలిగించడం వల్ల కంటిచూపు స్వాస మెరుగుపడుతుందని ఈ మాసంలో శాకాహారంగా తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని కార్థిక మాసం దినచర్యలకు మార్పుఉంటుందని , అందుకే ప్రతి ఒక్క దేవాలయంలో తెల్లవారు జామున దీపాలు వెలిగించడం వల్ల ఆరోజు మానసికంగా శారీరకంగా ఉత్సవం ఉల్లాసంగా ఉంటుందని కార్తీకమాసం దీపాలు వెలిగించడం తో అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం అని మంత్రి తెలిపారు ఈ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు
ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు, స్థానిక నేతలు, పుర ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

