
సౌదీలో మృతి చెందిన కార్యకర్త విస్లావత్ బాబ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు అన్ని తానై చూసుకున్న వై. అంజయ్య యాదవ్
నిన్న అర్ధరాత్రి హేమ్లా నాయక్ తండాకు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి
గత నెల 27న సౌదీలో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త విస్లావత్ బాబ్య
మృతి విషయం తెలిసిన వెంటనే విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడిన కేటీఆర్
మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ లు అండగా నిలిచారని తెలిపిన బాబ్య కుటుంబ సభ్యులు
గత వారం రోజులుగా మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు వై. అంజయ్య యాదవ్ చేసిన కృషిని కొనియాడిన మండల కార్యకర్తలు
( పయనించే సూర్యుడు జూన్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
బతుకుదెరువు కోసం సౌదీ ఆరేబియాకు వెళ్ళి గుండెపోటుతో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అండగా నిలిచారు. గత నెల 27న జిల్లేడు చౌదరిగగూడ మండలం వాచ్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని హేమ్ల నాయక్ తండాకు చెందిన విస్లావత్ బాబ్య సౌదీ ఆరేబియాలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ రవి, కిషన్ నాయక్, వినోద్ నాయక్, రామ్ చరణ్, రమేష్ నాయక్, వెంకట్ నాయక్, పాండు నాయక్ ద్వారా మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కి మృతికి గల కారణాలు తెలియజేసి, మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి కార్యకర్త మృతి చెందిన విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించే విధంగా విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ విధానాలను దగ్గరుండి చూసుకున్నారు. నిన్న అర్ధరాత్రి మృతదేహం శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ప్రభుత్వ నిబంధన ప్రకారం మృతదేహాన్ని బాబ్య కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియను పూర్తి చేశారు. మృతి చెందిన నాటి నుంచి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్ కు తెప్పించేవరకు అంజయ్య యాదవ్ చేసిన చొరవ ఆదర్శనీయమని మండల కార్యకర్తలు కొనియాడుతున్నారు. మృతి చెందిన కార్యకర్త కుటుంబ సభ్యులు సైతం అంజయ్య యాదవ్ చేసిన సహాయాన్ని మర్చిపోలేని, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అంజయ్య యాదవ్ మా కుటుంబానికి అండగా నిలిచారని చెప్పారు. సగటు కార్యకర్త కుటుంబం కోసం ఓ నాయకుడిగా అంజయ్య యాదవ్ వ్యవహరించిన తీరు మర్చిపోలేనిదని, దుఃఖంలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం గొప్ప విషయమని పలువురు అభిప్రాయపడ్డారు.
