
పయనించే సూర్యుడు మే 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మే 2 నుండి జూన్ 10వ తేది వరకు నిర్వహించే కిశోర వికాస్ వేసవి శిక్షణా శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు సిడిపీఓ సునీలత శుక్రవారం పాడేరు గ్రామ సచివాలయం పరిధిలోని గొల్లపల్లి .వన్. టు .త్రీ. తిమ్మాయిపాలెం. పెరమళ్ళపాడు. ఉలవపల్లి. అంగనవాడీ కేంద్రంలో శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ సురేఖ మాట్లాడుతూ 11 నుండి 14సంవత్సరాలు, 15 నుండి 18 సంవత్సరాల బాలికలను గ్రూపులుగా విభజించి వారానికి రెండు రోజులు బాల్యవివాహాలు, ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలికల పరిరక్షణకు అందుబాటులో వున్న చట్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు. పి .పద్మ. బి విజయ్ కుమారి. పోలమ్మ. తిరుపతమ్మ. షాహినా భాను. ఎన్. సుభాషిని మహిళ పోలీసు.హాయ్ ఇషా. కిషోర్ బాలికలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
