
పయనించే సూర్యుడు జూన్ 12 ప (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం, కుంటల పంచాయతీ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో గురువారం మండల రెవెన్యూ అధికారుల అధ్యక్షతన ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం భూ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, అప్పీల్ వ్యవస్థ, ఆర్వో ఆర్ సవరణ వంటి వాటి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసారు, రైతుల నుంచి అప్లికేషన్ తీసుకుంటూ భూ భారతి చట్టం పై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సిబ్బంది, తహశీల్దార్ లంకపల్లి వీరభద్రం, రెవెన్యూ అధికారులు, తురక వెంకటేష్, ఆఫ్రిద్, ఆర్ ఐ రత్తయ్య, శ్రీనివాస్, తోలేం బాబు, ఉపేందర్, రాజశేఖర్, డి శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.